ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Annamayya Statue: విగ్రహం ఏర్పాటు వెనుక ఉన్నదెవరు? - రాత్రికి రాత్రే అన్నమయ్య విగ్రహం ప్రత్యక్షం వార్తలు

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులోని బొల్ల‌వ‌రం కూడ‌లిలో రాత్రికి రాత్రే అన్న‌మయ్య విగ్ర‌హం ఏర్పాటు కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. విగ్రహాన్ని తొలగించిన పోలీసులు..ఎవ‌రు ఏర్పాటు చేశార‌నే అంశంపై ద‌ర్యాప్తు చేస్తున్నారు.

రాత్రికి రాత్రే అన్నమయ్య విగ్రహం ప్రత్యక్షం
రాత్రికి రాత్రే అన్నమయ్య విగ్రహం ప్రత్యక్షం

By

Published : Aug 21, 2021, 1:19 PM IST

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులోని బొల్ల‌వ‌రం కూడ‌లిలో రాత్రికి రాత్రే అన్న‌మయ్య విగ్ర‌హం ఏర్పాటు కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఉద‌యం విగ్ర‌హాన్ని చూసి స్థానికులు ఆశ్య‌ర్య‌పోయారు. ప్రొద్దుటూరులో ఎలాంటి విగ్ర‌హాలు ఏర్పాటు చేయ‌కూడ‌దంటూ ఇటీవల జిల్లా క‌ల్లెక‌ర్​ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో అన్న‌మ‌య్య విగ్ర‌హం ప్రత్యక్షం కావటం చర్చనీయాంశమైంది.

సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న డీఎస్పీ ప్ర‌సాద‌రావు అన్నమయ్య విగ్ర‌హాన్ని తొల‌గించారు. రాత్రికి రాత్రే విగ్ర‌హం ఎవ‌రు ఏర్పాటు చేశార‌న్న అంశంపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఒక‌రిని అదుపులోకి తీసుకున్నట్లు స‌మాచారం.

రాత్రికి రాత్రే అన్నమయ్య విగ్రహం ప్రత్యక్షం

ABOUT THE AUTHOR

...view details