ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రత్యేక హోదా ఏమయ్యింది...?

By

Published : Jan 13, 2020, 7:53 PM IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కడప జిల్లా రాయచోటిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పలు రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు.

rayachoti tdp leaders rallya
రాయచోటిలో అమరావతి కోసం ర్యాలీ

రాయచోటిలో అమరావతి కోసం ర్యాలీ
రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కడప జిల్లా రాయచోటిలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్ అధ్యక్షతన నేతాజీ కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో మూడు రాజధానులను ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నప్పుడు, 3 రాజధానుల నిర్మాణం ఎలా సాధ్యమని నిలదీశారు. ప్రత్యేక హోదా హామీ ఏమయ్యిందని ఎద్దేవా చేశారు. అన్ని ప్రాంతాల వారికీ సమాన దూరంలో ఉన్న అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details