ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కృష్ణా జలాల విషయంలో తెలంగాణ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది' - Telangana ministers comments on Krishna water

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని కడప జిల్లా అఖిలపక్ష రైతు సంఘం నాయకులు ధ్వజమెత్తారు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు నిలిపివేయాలని కోరుతూ.. సోమవారం కడపలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

All India Farmers Association meet at kadapa
అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం

By

Published : Jun 27, 2021, 3:30 PM IST

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని కడప జిల్లా అఖిలపక్ష రైతు సంఘం నాయకులు ఆరోపించారు. కడప ప్రెస్ క్లబ్​లో అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు తక్షణం ఆపాలని... లేదంటే రాయలసీమ ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోరని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు హెచ్చరించారు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల నిలుపుదల కోరుతూ.. సోమవారం కడపలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

తెలంగాణ మంత్రులు.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య తెలిపారు. ఈ వ్యాఖ్యలపై వైకాపా ఎమ్మెల్యేలు స్పందించకపోవడం దారుణం అన్నారు. ముఖ్యమంత్రి జగన్​ ఇప్పటివరకు శాంతియుతంగా ఉన్నారని.. ఇక స్పందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఇదీ చదవండి..

ఆ ఎమ్మెల్యే మాటలతో ఏకీభవిస్తున్నా!: సీపీఐ నారాయణ

ABOUT THE AUTHOR

...view details