ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Viveka murder case: వివేకా హత్య కేసు విచారణ.. సాక్ష్యాలుంటే ఇవ్వాలంటూ సునీతకు లాయర్ లేఖ! - వివేకా కుమార్తె సునీత వార్తలు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్ష్యాలుంటే సీబీఐకి ఇవ్వాలని ఆయన కుమార్తె సునీత,కేంద్ర గ్రీవెన్స్ సెల్​కు కడప న్యాయవాది సుబ్బారాయుడు లేఖ రాశాడు. ఈ లేఖపై ఆమె పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు వివేకా హత్యకేసులో 37వ రోజు సీబీఐ కొనసాగుతోంది. నేడు ఐదుగురు అనుమానితులను సీబీఐ ప్రశ్నిస్తోంది.

Viveka
Viveka

By

Published : Jul 13, 2021, 12:51 PM IST

మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతకు కడప న్యాయవాది సుబ్బారాయుడు లేఖ రాశారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలుంటే సీబీఐకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సుబ్బారాయుడు రాసిన లేఖపై ఆమె పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు... సునీతకు రాసిన లేఖను కేంద్ర గ్రీవెన్స్ సెల్​కు సైతం సుబ్బారాయుడు పంపారు.

37వ రోజు సీబీఐ విచారణ

వైఎస్‌ వివేకా హత్యకేసులో 37వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్రకారాగారం అతిథిగృహంలో నేడు ఐదుగురు అనుమానితులను సీబీఐ ప్రశ్నిస్తోంది. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, వాచ్​మెన్​ రంగన్న, ఇద్దరు కుమారులతోపాటు పులివెందుల పెట్రోల్ బంక్ యజమాని సుబ్బారెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి:

Viveka murder case: 20 రోజులుగా దస్తగిరిని, రెండు వారాలుగా ఎర్ర గంగిరెడ్డిని..

ABOUT THE AUTHOR

...view details