ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వేకోడూరులో రోడ్డు ప్రమాదం... భాజపా నేత మృతి - కడప రోడ్డు ప్రమాదంలో భాజపా నేత మృతి

రైల్వేకోడూరులో రోడ్డు ప్రమాదం... భాజపా నేత మృతి
రైల్వేకోడూరులో రోడ్డు ప్రమాదం... భాజపా నేత మృతి

By

Published : May 3, 2020, 6:43 AM IST

Updated : May 3, 2020, 7:48 AM IST

06:33 May 03

రైల్వేకోడూరులో రోడ్డు ప్రమాదం

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఉప్పరపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మైసూరువారి పల్లికి చెందిన మాజీ సైనికుడు, భాజపా రైల్వేకోడూరు  మండల అధ్యక్షుడు కారుమంచి వెంకటసుబ్బయ్య మృతిచెందారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన పండ్ల వ్యాపారం చేస్తున్నారు.  తిరుపతి నుంచి టెంపోలో పండ్లు తీసుకుని వస్తుండగా ఉప్పరపల్లి దాబా వద్ద ఆగి ఉన్న లారీని టెంపో వెనుక నుంచి ఢీకొట్టింది.  

ఈ ప్రమాదంలో టెంపో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా పక్కన కూర్చున్న కారుమంచి వెంకటసుబ్బయ్య అక్కడికక్కడే మృతిచెందారు. కరోనా వైరస్ నిరోధానికి ప్రభుత్వం లాక్​డౌన్  ప్రకటించినప్పటి నుంచి సుబ్బయ్య పలు సామాజిక కార్యక్రమాలు చేశారు. ప్రతినిత్యం అన్నదానం, సానిటైజేర్లు, మాస్కులు పంపిణీ చేస్తున్నారు. ప్రమాద ఘటనతో మైసూరువారిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి : ప్రాణదాతలకు పుష్ప నీరాజనం


 

Last Updated : May 3, 2020, 7:48 AM IST

ABOUT THE AUTHOR

...view details