ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆవును తప్పించబోయి అనంతలోకాలకు...

వినాయక నిమజ్జానికి వెళ్లి తిరుగుప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

By

Published : Sep 5, 2019, 1:53 PM IST

accident accured in amagampalle, one died and two members injured in kadapa

కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లెలో నిమజ్జనం రోజు అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ వ్యక్తిమృతి చెందగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోరుమామిళ్ల పట్టణానికి చెందిన నవీన్, బాలకృష్ణ, సుబ్బరాయుడుతో కలిసి వినాయకుని నిమజ్జనం కోసం బ్రహ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అమ్మకంపల్లె వద్ద ఆవు దూడని తప్పించబోయి అదుపు తప్పి కింద పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడిన నవీన్ అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం బి.కోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆవును తప్పించబోయి..వ్యక్తి అనంతలోకాలకు

ABOUT THE AUTHOR

...view details