ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బస్సును ఢీకొన్న ఆటో.. నూతన వధూవరులకు గాయాలు - ap road accident news

కడప జిల్లా రాజంపేటలో ఊటుకూరు వద్ద బస్సును ఆటో ఢీకొన్న ఘటనలో నూతన వధూవరులకు గాయాలయ్యాయి. వీరితో పాటు మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

బస్సును ఢీ కొన్న ఆటో.. నూతన వధూవరులకు గాయాలు

By

Published : Nov 22, 2019, 7:41 AM IST

రోడ్డు ప్రమాదంలో నూతన వధూ వరులకు గాయాలు

కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బస్సును ఆటో ఢీకొనటంతో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో నూతన వధూవరులూ ఉన్నారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రాజంపేట మండలం ఆకేపాడు పెద్దూర్​ నుంచి ఓబులవారపల్లె మండలం బోటుకిందపల్లెకి సారె తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్​ ఒక్కసారిగా బ్రేక్​ వేయడం వల్లే ప్రమాదం జరిగిందని ఆటో డ్రైవర్​ మహబూబ్​బాషా తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details