ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వేకోడూరులో 29 ఎర్రచందనం దుంగలు స్వాధీనం - 29 red sandalwood logs seized at Railway Kodur

కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న 29 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు.

29 red sandalwood logs seized at Railway Kodur
రైల్వే కోడూరులో 29 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

By

Published : Sep 19, 2020, 8:29 PM IST

రైల్వేకోడూరు మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో శుక్రవారం పోలీసులు తనిఖీలు చేశారు. పెద్దరాజుపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న 16 ఎర్రచందనం దుంగలను, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

శనివారం తెల్లవారుజామున కన్నెగుంట ఎస్టీ కాలనీ సమీపంలో కూడా ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు సోదాలు చేయగా అక్కడినుంచి తరలిస్తున్న13 ఎర్రచందనం దుంగలను, ఐదుగురు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు రాజంపేట డీఎస్పీ నారాయణ స్వామి తెలిపారు. ఎర్రచందనం రవాణాపై ఎవరికీ సమాచారమున్నా.. పోలీసులకు తెలపాలని సూచించారు. ఈ తనిఖీల్లో రైల్వేకోడూరు పోలీసులు, టాస్క్ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: గండికోట జలాశయంలో పెరిగిన నీటిమట్టం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details