ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఓటర్ల కోసం మద్యం తరలింపు : 240 లిక్కర్ సీసాలు సీజ్

By

Published : Apr 6, 2021, 3:08 AM IST

జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న మద్యాన్ని కడప జిల్లా బద్వేలులో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని సీజ్​ చేశారు.

liquor bottles Seized in Badvel
మద్యం సీసాలు పట్టివేత

కడప జిల్లా బద్వేలులో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో ఓటర్లుకు పంచేందుకు రవాణా చేస్తున్న 240 మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీసాలతో పాటు టాటా ఏసీ వాహనాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.

స్థానిక నేతల హస్తం..

అక్రమ మద్యం రవాణ చేస్తున్న టాటా ఏసీ వాహనం డ్రైవర్ గంగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల్లో పంచేందుకు రవాణా చేస్తున్న వ్యవహారంలో స్థానిక నాయకుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మిగతా వారిని పట్టుకుంటామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

పవన్ కల్యాణ్​పై కేసు నమోదు..ఎందుకంటే!

ABOUT THE AUTHOR

...view details