ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక రవాణా చేస్తున్న 11 ఎడ్ల బండ్లు స్వాధీనం - vempalli news

కడప జిల్లా వేంపల్లి పాపాగ్ని నది నుంచి 11 ఎడ్ల బండ్లలో అక్రమంగా జరుగుతున్న ఇసుక తరలింపును పోలీసులు అడ్డుకున్నారు.

kadapa district
ఇసుక రవాణా చేస్తున్న 11 ఎద్దులబండ్లు స్వాధీనం

By

Published : Jul 15, 2020, 10:27 PM IST

కడప జిల్లా వేంపల్లి పాపాగ్ని నది నుంచి ఇసుకను ఎడ్ల బండ్లపై అక్రమంగా తరలిస్తుండగా పులివెందుల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఇసుకను తరలించటానికి సిద్ధంగా ఉన్న 11 ఎడ్ల బండ్లను, యజమానులను అరెస్ట్ చేసి వేంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అనుమతులు తీసుకోకుండా పాపాగ్ని నది నుంచి సొంత పనుల పేరుతో ఇసుకను తరలించి విక్రయాలు జరుపుతున్నారని పులివెందుల ఎస్ఈబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి ఇలా ఎవరైనా గండి కొడితే ఉపేక్షించేది లేదని.. కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details