ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తల్లి లేదన్న బాధతో.. యువకుడు బలవన్మరణం - young man suicide news update

జన్మనిచ్చిన అమ్మ, పెంచిన అమ్మ ఇద్దరూ మరణించారు. మాతృ దినోత్సవం రోజున వారిని తలుచుకుంటూ మనస్థాపానికి గురైన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఈ ఘటన విషాదం నింపింది.

young man suicide
అమ్మలను తలచుకొని బలవన్మరణం

By

Published : May 11, 2020, 4:36 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన రావాడ మంగిరెడ్డి (25) అనే యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగిరెడ్డికి జన్మనిచ్చిన తల్లి.. అతనికి 3 నెలల వయసున్నప్పుడే మరణించింది. తనను మూడేళ్ల క్రితం దత్తత తీసుకున్న మేనత్త కూడా మరణించింది.

మంగి రెడ్డి చిన్నాన్న గోవిందరెడ్డి వద్ద ఉంటూ, పాత ఇనుము కొనే వ్యాపారం చూసుకుంటున్నాడు. ఈనెల 10న మాతృ దినోత్సవం కావడం ఇద్దరి అమ్మలను గుర్తు చేసుకొని తీవ్రంగా మనస్థాపానికి గురయ్యాడు. దుకాణంలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details