ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 4, 2020, 2:09 PM IST

ETV Bharat / state

'మూడు రాజధానులతోనే.. సర్వతోముఖాభివృద్ధి'

మూడు రాజధానులు ఏర్పాటుతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని వైకాపా నేతలు ఉద్ఘాటించారు. తణుకులో వైకాపా ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్ధతుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

ycp protest to support to three capitals
తణుకులో వైకాపా రిలే నిరాహార దీక్షలు

మూడు రాజధానులకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైకాపా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రధాన రహదారిలో మూడు రోజులపాటు ఈ నిరాహార దీక్ష చేయనున్నారు. ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దంటూ నినాదాలు చేశారు. అభివృద్ధి వ్యతిరేకి చంద్రబాబు అంటూ నాయకులు దుయ్యబట్టారు. ప్రజలంతా మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని కోరారు.

తణుకులో వైకాపా రిలే నిరాహార దీక్షలు

ABOUT THE AUTHOR

...view details