ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 26, 2021, 12:15 PM IST

ETV Bharat / state

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రశాంతంగా భారత్ బంద్

కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బంద్​కు మద్దతు ప్రకటించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హోటళ్లు, దుకాణాలు మూతపడ్డాయి.

west godavari bharat bund
పశ్చిమగోదావరి జిల్లా వార్తలు,పశ్చిమ గోదావరిలో భారత్ బంద్ వార్తలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రైవేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న బంద్​లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. రాష్ట్రం ప్రభుత్వం బంద్​కు మద్దతు ప్రకటించడంతో వాటిని ముందుగానే డిపోల్లో నిలిపేశారు. నిత్యం ప్రయాణికులతో కళకళలాడే బస్టాండ్​లు బంద్​తో బోసిపోయాయి. వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details