ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వండి' - villagers protest latest news

పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో.. చంద్రబాబు కాలనీవాసులు ఆందోళనకు దిగారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ధర్నా చేశారు.

villagers dharna  to give houses
అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గ్రామస్థుల ధర్నా

By

Published : May 11, 2020, 2:50 PM IST

అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ.. చివటం గ్రామస్తులు ధర్నాకు దిగారు. స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీ వాసులంతా కలిసి.. పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. గ్రామంలో 24 సంవత్సరాలుగా దేవస్థానం భూముల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలకు నోచుకోకుండా కాలం గడుపుతున్నామన్నారు.

అలాంటి తమను కాదని మిగిలిన వారికి ఇళ్ల స్థలాల మంజూరు చేయడం ఏంటని నిలదీశారు.ఎంపిక చేసిన వారితో పాటు తమకు కూడా అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు సీపీఎం నాయకులు కామన మునిస్వామి సంఘీభావం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details