ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విత్తన దుకాణాల్లో విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల తనిఖీలు - పశ్చిమ గోదావరి జిల్లాలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

పశ్చిమ గోదావరి జిల్లాలోని విత్తన దుకాణాల్లో విజిలెన్స్​, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విత్తనాల కొనుగోలు, అమ్మకాలు సరిగా జరగడం లేదని గుర్తించారు. అనధికారికంగా నిల్వ ఉంచిన విత్తనాలను ల్యాబ్​కు పంపారు. నివేదికలు వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు.

raids on seed shops
raids on seed shops

By

Published : Jun 11, 2021, 5:18 PM IST

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పట్టణం బోసుబొమ్మ సెంటర్​లో ఉన్న ఉష సీడ్స్, సాయి రామ్ సీడ్స్ విత్తనాల దుకాణాల్లో ఏలూరు విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ ఏవో శ్రీనివాస్ కుమార్, చింతలపూడి మండల వ్యవసాయ అధికారిణి మీనా కుమారి తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. విత్తనాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన వివరాలు సరిగా నమోదు చేయనట్లు గుర్తించారు. అనధికారికంగా నిల్వ ఉంచిన విత్తనాల్లో కొన్ని నకిలీ విత్తనాలుగా అనుమానం వ్యక్తం చేశారు. వాటి నాణ్యతను పరిశీలించేందుకు ల్యాబ్​కు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ల్యాబ్ నుండి రిపోర్టులు వచ్చిన అనంతరం దుకాణాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details