ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 24, 2019, 12:32 PM IST

ETV Bharat / state

ఉల్లి మార్కెట్​పై విజిలెన్స్ అధికారుల దాడులు

ఉల్లి మార్కెట్​పై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. మార్కెట్ యార్డుకు పన్ను కట్టకుండా వ్యాపారం చేస్తున్నవారిని గుర్తించి.. వారి దగ్గర నుంచి ఉల్లి నిల్వలు స్వాధీనం చేసుకున్నారు.

ఉల్లి మార్కెట్​పై విజిలెన్స్ అధికారుల దాడులు

ఉల్లి మార్కెట్​పై విజిలెన్స్ అధికారుల దాడులు

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉల్లి మార్కెట్​పై విజిలెన్స్​ అధికారులు దాడులు చేశారు. మార్కెట్ యార్డ్​కు ఎటువంటి పన్ను కట్టకుండా వ్యాపారం చేస్తున్న ఇద్దరు వ్యాపారులను గుర్తించారు. వారివద్ద 17 టన్నుల ఉల్లి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఉల్లి నిల్వలు సుమారు రూ.23 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఉల్లి నిల్వలను మార్కెట్ యార్డ్ కార్యదర్శికి అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details