ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడేపల్లిగూడెం నిట్ స్నాతకోత్సవానికి రానున్న ఉపరాష్ట్రపతి - తాడేపల్లి గూడెం నిట్ స్నాతకోత్సవం న్యూస్

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్​ తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరుకానున్నట్లు నిట్ డైరెక్టర్ సీఎస్​పీ రావు తెలిపారు. డిసెంబర్ 24వ తేదీన నిట్ ప్రాంగణంలో స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

vice president of india will attend thadepalligudem nit convocation
vice president of india will attend thadepalligudem nit convocation

By

Published : Dec 17, 2019, 4:42 PM IST

తాడేపల్లిగూడెం నిట్ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్​ ప్రాంగణంలో డిసెంబర్ 24న నిర్వహించనున్న తొలి స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతోపాటు గవర్నర్ బిశ్వభూషణ్ రానున్నట్లు నిట్ డైరెక్టర్ సీఎస్​పీ రావు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. వీఐపీలకు ఇబ్బంది లేకుండా నాలుగు హెలిప్యాడ్స్ ఏర్పాటు చేశామన్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఉపరాష్ట్రపతి హాజరవుతారని.. వెల్లడించారు. 325 మంది ఇంజినీరింగ్ పట్టభద్రులు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు పొందుతారని నిట్ డైరెక్టర్ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details