Road Accident: పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తండ్రీ కుమార్తె మృతి - devarapalli road accident
![Road Accident: పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తండ్రీ కుమార్తె మృతి Road Accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13351738-658-13351738-1634222388395.jpg)
09:30 October 14
దేవరపల్లి సమీపంలో వ్యాను అదుపుతప్పి ప్రమాదం
పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి సమీపంలో వ్యాను బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. దసరా నవరాత్రుల సందర్భంగా.. విజయవాడలో దుర్గమ్మను దర్శించుకుని పత్తిపాడు మండలం శరభవరం గ్రామానికి వెళుతుండగా ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి లోకనాగు, కుమార్తె వీరలక్ష్మీ(3) మృతి చెందారు. డ్రైవర్ నిద్రమత్తులో వ్యానును వేగంగా నడడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి
Power Crisis: విద్యుత్ కొరతపై రాష్ట్రానికి ముందే కేంద్రం హెచ్చరిక