గతంలో గిరిజనులు వెదురు వస్తువులు తయారు చేస్తూ ఉపాధి పొందేవారు. ప్లాస్టిక్ వస్తువులు వచ్చాక గిరాకీ తగ్గి ఉపాధి పోయింది. ప్లాస్టిక్ పెనుముప్పుగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయమైన వెదురు వస్తువులపై అందరూ దృష్టి పెట్టారు. ఇప్పుడు ఈ వస్తువుల తయారీ ఊపందుకుంటోంది.
ఐటీడీఏ సహకారంతో
పశ్చిమగోదావరి జిల్లాలో ఐటీడీఏ, ఏపీఎస్ఎస్డీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన యువతకు వెదురు వస్తువుల తయారీ నేర్పిస్తున్నారు. నేటి కాలానికి తగ్గట్టుగా శిక్షణ ఇస్తున్నారు. అలంకరణ వస్తువులు, ఫర్నీచర్ తయారుచేసి ఆ గిరిజనులు ఉపాధి పొందుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కేఆర్. పురం ఐటీటీఏ కార్యాలయ ఆవరణలో 'గిరిజన యూత్ శిక్షణా కేంద్రం' పేరుతో శిక్షణా కేంద్రం ఏర్పాటుచేశారు. 2 నెలలపాటు సాగే ఈ శిక్షణలో ట్రెండ్కు తగ్గట్లు వెదురు వస్తువులు తయారు చేయడం.. వాటిని మార్కెటింగ్ చేసుకోవడంపై శిక్షణ ఇస్తారు. ఇలా దాదాపు 12 వందల మంది శిక్షణ పొందారు.