ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏసీ రిపేర్ చేస్తుండగా పేలుడు... ముగ్గురికి గాయాలు

ఏసీ రిపేర్ చేస్తుండగా పేలుడు సంభవించి ముగ్గురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఏలూరులో జరిగింది.

By

Published : Jul 19, 2019, 12:32 AM IST

క్షతగాత్రులు

ఏసీ రిపేర్ చేస్తుండగా పేలుడు... ముగ్గురికి గాయాలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఏసీ కంప్రెసర్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. కంప్రెసర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు నగరంలోని టూ టౌన్ పరిధిలోని డీమార్ట్ ఎదురుగా కళ్యాణ్ అనే వ్యక్తి తన దుకాణంలో ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగింది. ఒక్క సారిగా మంటలు వచ్చిన పరిస్థితుల్లో.. దుకాణం యజమాని కళ్యాణ్ తోపాటు అతను వద్ద పనిచేస్తున్న సిబ్బంది రఘు, చందుకు గాయాలయ్యాయి. వెంటనే వీరిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details