ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్ని ప్రమాదం.. 3 తాటాకు ఇళ్లు దగ్ధం - మాజీ మంత్రి పితాని సత్యనారాయణ

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో అగ్ని ప్రమాదం జరిగింది. 3 తాటాకుల ఇళ్లు దగ్ధమయ్యాయి. సుమారు 15 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.

west godavari district
అగ్ని ప్రమాదం.. మూడు తాటాకు ఇళ్లు దగ్ధం..

By

Published : May 21, 2020, 7:59 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం శివారు చిన్న పేటలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంతో 3 తాటాకుల ఇళ్లు దగ్ధమయ్యాయి. 4 కుటుంబాలవారు నిరాశ్రయులు అయ్యారు. ఈ ప్రమాదం జరిగిన మూడు ఇళ్లల్లోని విలువైన సామగ్రి, నగదు, బంగారం, దుస్తులు బూడిదయ్యాయి.

సుమారు 15 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బియ్యం, నిత్యావసర సరకులు అందజేశారు. వైకాపా స్థానిక నాయకులు కూడా బాధితులకు నిత్యావసర సరుకులు, దుస్తులు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details