ఉంగుటూరులో ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ
ఉంగుటూరులో ప్రభుత్వ మద్యం దుకాణంలో వాచ్మెన్ ఉండగానే.. దుండగులు చోరీకి పాల్పడ్డారు. భారీగా నగదు అపహరణకు గురైంది.
ఉంగుటూరులో ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో ప్రభుత్వ మద్యం దుకాణంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. దుకాణం షెడ్డు అవతలి వైపు వాచ్మెన్ ఉండగానే.. మరోవైపు తలుపు తాళం పగలగొట్టి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు రూ.3,38,580 నగదును అపహరించారు. ఎక్సైజ్ సీఐ రమేష్ బాబు, వాసవిలు మద్యం దుకాణాన్ని పరిశీలించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.