ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా "కథ-2018” పుస్తకావిష్కరణ కార్యక్రమం

వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ సమాజాన్ని కదిలించే కథలు, సాహిత్యం... చరిత్రకు ఆనవాళ్లు. తెలుగు సాహిత్యాన్ని పాఠకులకు పరిచయం చేసే శక్తి కథకే ఉంది. అంతటి శక్తి కలిగిన కథల సంకలనం "కథ-2018” పుస్తకావిష్కరణ నరసాపురంలో ఘనంగా జరిగింది.

By

Published : Nov 25, 2019, 5:35 AM IST

Updated : Jan 18, 2023, 2:54 PM IST

Katha 2018 book launch in narsapuram
ఘనంగా "కథ-2018” పుస్తకావిష్కరణ కార్యక్రమం

ఘనంగా "కథ-2018” పుస్తకావిష్కరణ కార్యక్రమం

తెలుగు సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా 29 ఏళ్లుగా కథా ప్రస్థానం కొనసాగుతోంది. ఈసారి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైఎన్.కళాశాలలో కథ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. ప్రముఖ సాహితీవేత్త వేల్చేరు నారాయణరావు... "కథ-2018” పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు వంశీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు సాహితీవేత్తలు, భాషాభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచయతల ముఖాముఖి నిర్వహించారు. పుస్తకంలోని కథలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు.

కవిత్వం, పద్య కవిత్వం, సాహిత్యం కంటే... కథ సామాన్యులకు బాగా దగ్గరవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీకారం చుట్టిన కథా సంకలనం... ప్రజల్లోకి బలంగా వెళ్లడమే కాకుండా, భాషాభివృద్ధికి పునాది వేస్తుందని సాహితీవేత్తలు అంటున్నారు. "కథా సంకలనం" కలకాలం ఇలాగే కొనసాగాలని, తెలుగు భాషాభివృద్ధికి దోహదం చేస్తుండాలని ఆకాంక్షించారు.


Last Updated : Jan 18, 2023, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details