ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 25, 2020, 9:20 PM IST

ETV Bharat / state

కరోనాను అరికడదాం.. లాక్ డౌన్​కు సహకరించండి: ఎమ్మెల్యే కారుమూరి

కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్న వేళ తణుకు పట్టణంతోపాటు మండల కేంద్రాలైన ఇరగవరం, అత్తిలిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ‌అమలులో ఉంటుందని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

mla karumoori nageshwar rao
లాక్ డౌన్​కు సహకరించండి:ఎమ్మెల్యే కారుమూరి

జులై చివరి వరకు తణుకు పట్టణంతోపాటు మండల కేంద్రాలైన ఇరగవరం, అత్తిలిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. కరోనా విజృంభిస్తున్నందున పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ ‌అమలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన వివరించారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్న ప్రాంతాలలో నిత్యావసర దుకాణాలు ఉదయం ఆరు గంటలనుంచి పదకొండు గంటల వరకు తెరిచి ఉంటాయని, ఔషధ దుకాణాలు మాత్రం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలిపారు. మిగిలిన అన్ని వ్యాపారాలు మూసేయాలని స్పష్టం చేశారు. అవసరం లేనిదే బయటకు రావద్దని, ప్రజలందరూ గతంలో మాదిరిగా లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు.

ఇవీ చూడండి-'కరోనా ప్రబలుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం'

ABOUT THE AUTHOR

...view details