ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా అనుమానితుడిని చెత్త ఆటోలో తరలించటంపై విచారణ

By

Published : Jul 29, 2020, 6:02 PM IST

కరోనా అనుమానితుడిని చెత్త ఆటోలో తరలించటంపై.. పశ్చిమ గోదావరి జిల్లా సబ్​కలెక్టర్ విచారణ చేపట్టారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

sub collector of west godaravari
కరోనా అనుమానితుడిని చెత్త ఆటోలో తరలించటంపై సబ్​కలెక్టర్ విచారణ

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ భీమవరం గ్రామంలో కరోనా అనుమానితుడిని చెత్త ఆటోలో తరలించటంపై.. సబ్​కలెక్టర్ విచారణ చేపట్టారు. ఆకివీడు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన విచారణ కార్యక్రమంలో తహసీల్దార్ నుంచి గ్రామ స్థాయి అధికారులు వివరాలు సేకరించారు. అనారోగ్యంతో బాధపడే వారిని ఇలా చెత్త ఆటోలో తరలించటం సరికాదని హితవు పలికారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సబ్​కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారుల నుంచి సేకరించిన నివేదికను కలెక్టర్​కు అందజేస్తామని విశ్వనాథన్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details