ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో మరింతగా లాక్​డౌన్​ నిబంధనలు అమలు - lock down in west godavari district news update

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజవర్గంలో కరోనా కేసులు విజృంభిస్తున్న కారణంగా నగరంలో నేటి నుంచి మరింతగా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. దుకాణాల అనుమతి సమయం దాటిన తర్వాత సైతం ప్రజలు బయటకు వస్తుండటంపై.. అధికారులు వారిని కట్టడి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.

strictly lockdown regulations
తణుకులో మరింతగా లాక్​డౌన్​ నిబంధనలు అమలు

By

Published : Jul 16, 2020, 9:41 PM IST

రోజు రోజుకు నియోజకవర్గ పరిధిలో విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి అధికారులు తిరిగి నిబంధనలను కఠినతరంగా అమలు చేస్తున్నారు. గోస్తనీ వంతెన, రాజీవ్ చౌక్ సెంటర్, వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా రోడ్లలోనూ.. వంతెన పైన పోలీసులు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

తాడేపల్లిగూడెం వైపు గ్రామాల ప్రజలు పట్టణంలోనికి రాకుండా ఫ్లైఓవర్ వంతెన రెండు వైపులా మూసివేశారు. మరింత కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్న కారణంగా.. పట్టణ ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఈ నిషేధాజ్ఞలు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details