ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆంక్షలు ఉల్లంఘిస్తున్న వారిపై.. కఠిన చర్యలు

By

Published : May 18, 2021, 7:30 AM IST

తణుకులో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించిన వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు.

curfew violators arrest at tanuku
curfew violators arrest at tanuku

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కర్ఫ్యూను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరడా ఝళిపిస్తున్నారు. రహదారులపై తిరుగుతున్న వారిని అడ్డుకొని కేసులు నమోదు చేస్తున్నారు. శర్మిష్ఠ కూడలిలో 15 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కరోనా వ్యాప్తిపై వారికి అవగాహన కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details