ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భీమవరంలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు అరెస్ట్​

By

Published : Jun 25, 2020, 8:09 AM IST

భీమవరంలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని మంగళవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఓ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా సమచారం అందుకున్న పోలీసులు... తనిఖీలు చేయగా పట్టుబడినట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.

six people were arrested for selling drugs in bhimavaram
గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని పట్టుకున్న బీమవరం పోలీసులు

గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వన్​టౌన్​ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్​ చేశారు. వీరి నుంచి 6.9 కేజీల గంజాయిని, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.35 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరుకు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్లు​ డీఎస్పీ తెలిపారు. ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details