గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వన్టౌన్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. వీరి నుంచి 6.9 కేజీల గంజాయిని, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.35 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరుకు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.
భీమవరంలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు అరెస్ట్
భీమవరంలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని మంగళవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఓ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా సమచారం అందుకున్న పోలీసులు... తనిఖీలు చేయగా పట్టుబడినట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.
![భీమవరంలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు అరెస్ట్ six people were arrested for selling drugs in bhimavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7747421-648-7747421-1593014526076.jpg)
గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని పట్టుకున్న బీమవరం పోలీసులు