ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోమరిపోతు వ్యవసాయం ఏదైనా ఉందంటే.. అది వరి సాగు: శ్రీరంగనాథరాజు

పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో కృషి విజ్ఞాన కేంద్రం రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీరంగనాథ రాజు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సోమరిపోతు వ్యవసాయం.. వరిసాగు అని వ్యాఖ్యానించారు.

Silver Jubilee Celebrations of Krishi Vigyan Kendra
కృషి విజ్ఞాన కేంద్రం రజతోత్సవ వేడుకలు

By

Published : Mar 27, 2021, 9:13 PM IST

Updated : Mar 28, 2021, 7:07 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండల కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రం రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, భారత వ్యవసాయ పరిశోధనా మండలి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో.. శాస్త్రవేత్తలు సాధించిన ప్రగతి, తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్​లర్​ విష్ణువర్ధన్ రెడ్డి, ఏపీ వ్యవసాయ మిషన్ ఛైర్మన్ నాగిరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సోమరిపోతు వ్యవసాయం: మంత్రి

ఈ కార్యక్రమంలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమరిపోతు వ్యవసాయం ఏదైనా ఉందంటే అది వరి సాగు అని మంత్రి అన్నారు. కష్టపడకుండానే వ్యవసాయం చేయొచ్చని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మాటలతో అక్కడున్న రైతులంతా నివ్వెరపోయారు. అనంతరం రైతుల కష్టాల గురించి మాట్లాడారు.

ఇదీ చదవండీ...

రాష్ట్రాలకు దన్ను: 15వ ఆర్థిక సంఘం కీలక సిఫార్సులు

Last Updated : Mar 28, 2021, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details