ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 23, 2021, 5:12 PM IST

ETV Bharat / state

AP Congress: అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: శైలజానాథ్

సీఎం జగన్ పాలనలో రాష్ట్రం దివాళా తీసిందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దారుణ పరిస్థితి నెలకొందని ఆరోపించారు. అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

sailajanath comments on cm jagan on depts
sailajanath comments on cm jagan on depts

సీఎం జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రం దివాళా తీసిందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. ప్రతి నెల జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. రూ. 40వేల కోట్ల రూపాయలకు లెక్కలు చూపకుండా.. బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడెక్కడ అప్పులు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీ స్థలం కనపడితే చాలు.. ఆక్రమించుకోవడానికి, అమ్ముకోవడానికి జగన్ ప్రభుత్వం యత్నిస్తోందని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details