ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రొయ్యల ప్లాంట్ తొలగించాలి' - bheemavaram

రొయ్యలు శుభ్రం చేసే ప్లాంట్​ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలోని లోసరి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పంచాయతీ అనుమతి లేకుండా... నివాస ప్రాంతాలను ఆనుకుని ఈ పరిశ్రమ ఏర్పాటు చేశారని ఆరోపించారు. గాలి, నీరు పూర్తిగా కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

'రొయ్యల ప్లాంట్ తొలగించాలి'

By

Published : Mar 16, 2019, 12:29 PM IST

'రొయ్యల ప్లాంట్ తొలగించాలి'
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం లోసరి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ గ్రామంలోనిరొయ్యలు శుభ్రం చేసే ప్లాంట్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ అనుమతి లేకుండా... నివాస ప్రాంతాలను ఆనుకుని ఈ పరిశ్రమ ఉన్న కారణంగా..గాలి, నీరు పూర్తిగా కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇప్పటికే రోగాలతో బాధపడుతున్నామని.. ప్లాంటు తొలిగించే వరకు తమ నిరసన కొనసాగిస్తామన్నారు. ఈ పరిణామంతో.. సంస్థలోని కార్మికులురహదారిపైనే నిలిచిపోయారు. పోలీసులు గ్రామస్తులతో మాట్లాడారు.ఫ్యాక్టరీ యజమానులతోనూ చర్చించిఫ్లాట్​ల నిర్వహణ ఆపించారు. ఆ తర్వాతే గ్రామస్థులు ఆందోళన విరమించారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details