ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమ గోదావరిపై వర్షాల పడగ.. ఊరూవాడా నీట మునక - కొనసాగుతున్న వరద ఉధృతి

వాయుగుండం ప్రభావం.. పశ్చిమ గోదావరి జిల్లాపై కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు ఉంగుటూరు, దెందులూరు ప్రాంతాల్లో వరద పోటెత్తింది.

rain effect in west godavari district
rain effect in west godavari district

By

Published : Oct 15, 2020, 12:47 AM IST

Updated : Oct 15, 2020, 1:12 AM IST

పశ్చిమ గోదావరిపై వర్షాల పడగ

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో వరద ఉధృతి కొనసాగింది. కైకరంలోని బీసీ, ఎస్సీ కాలనీలు‌, శివారు గ్రామాలైన బ్రహ్మానందపురం, లంకమాలపల్లి, వెంకటకృష్ణాపురం నీటమునిగాయి. నల్లపాడు గ్రామంలోని ఇరిగేషన్ చెరువులోకి రెండో రోజు వరద నీరు పోటెత్తింది. తాడిపూడి కాలువ ఉద్ధృతంగా ప్రవహించింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటితో వల్ల గొల్లగూడెం, తిమ్మయ్యపాలెం, గోపీనాథపట్నం, కంసాలిగుంట గ్రామాల్లో... వరి, పామాయిల్, మినప తోటలు నీటమునిగాయి. జిల్లా గుండా ప్రవహిస్తున్న ఏలూరు ప్రధాన కాలువ పోటెత్తింది. వెల్లమిల్లి, నాచుగుంట, నారాయణపురం తదితర ప్రాంతాల్లో ఓవర్ ఫ్లో కారణంగా గట్టుదాటి నీరు ప్రవేశించింది. 372 హెక్టార్లలో వరి పంట నేల వాలగా, మరో 157 హెక్టార్లలో వరి నీట మునిగింది. గణపవరం మండలంలోని పిప్పరలోని ఎస్సీ కాలనీ జలమయమైంది. యదనమర్రు కాలువకు వరద భారీగా చేరింది.

ప్రమాదకరంగా మొండికోడు డ్రైన్

దెందులూరు మండలం కొవ్వలిలో మొండికోడు డ్రైన్ లో వరద నీటి ప్రవాహం ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. పలుచోట్ల పొలాలను ముంచెత్తింది . తాసు పాము శిల వద్ద డ్రైన్ గట్ల ఇరువైపులా కోతకు గురికావడంతో అంతా ఆందోళన చెందుతున్నారు . పటిష్ట పరచడానికి రైతులు చర్యలు చేపట్టారు . కుడివైపు చేపల చెరువు గట్టు వద్ద నీటి ప్రవాహానికి కోతకు గురవుతోంది . నీటి ప్రవాహం పెరగడంతో తో గ్రామస్తులులో ఆందోళన నెలకొంది.

ఆదుకుంటాం....

వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి చెప్పారు. దెందులూరు, సత్యనారాయణపురం గ్రామాల్లో నీటమునిగిన ఇళ్లను ఆయన పరిశీలించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి నష్టం వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అధైర్య పడాల్సిన అవసరం లేదని తెలిపారు. సత్యనారాయణపురంలో నీట మునిగిన పంట పొలాలను, గుండెరులో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. స్థానిక రైతులు గతంలో ఎన్నడూ ఇంత వరద రాలేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దెందులూరులో వరద బాధితులకు ఆహార పొట్లాలను అందజేశారు. తహసీల్దార్ శేషగిరి, ఎంపీడీవో లక్ష్మీ, వైకాపా నాయకులు తిలక్, నాని తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో 71,821 హెక్టార్లలో పంట నష్టం: వ్యవసాయశాఖ

Last Updated : Oct 15, 2020, 1:12 AM IST

ABOUT THE AUTHOR

...view details