పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఎన్నారై ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్ దలవాడ జాన్ సుందర్ షీలా ఆర్థిక సహకారంతో... వంగలపూడి జక్కయ్య, కావలి నాని ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు, బియ్యం పంపిణీ చేశారు. విపత్తు కాలంలో ఇబ్బందుల్లో ఉన్న పేదవారిని ఆదుకోవడానికి తమవంతు సాయం అందించినట్లు తెలిపారు.
ఎన్నారై సహకారంతో పేదలకు నిత్యావసరాలు పంపిణీ
కరోనా విపత్తు సమయంలో తినడానికి తిండిలేక అల్లాడుతున్న పేదలను ఆదుకోవడానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు తమకు తోచిన రీతిలో స్పందిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం 23వ వార్డులో పేద కుటుంబాలకు ఎన్నారై సాయంతో నిత్యావసరాలు పంపిణీ చేశారు.
provid necessaries to poor people in west godavari dst ny NRI