ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 7, 2021, 7:26 PM IST

ETV Bharat / state

ద్వారకా తిరుమల శ్రీవారికి వెండి ఖడ్గం బహుకరణ

విజయవాడకు చెందిన ఓ భక్తుడు.. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారికి వెండి ఖడ్గాన్ని సమర్పించారు. దాదాపు ఒకటిన్నర కిలో పైబడి బరువున్న ఈ ఖడ్గం విలువ రూ. లక్షా 7 వేల 100 ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు.

Presentation of silver sword to Dwarka Thirumala Swami of West Godavari district
ద్వారకా తిరుమల శ్రీవారికి కేజీన్నర వెండి ఖడ్గం బహుకరణ

పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి.. విజయవాడకు చెందిన ఓ భక్తుడు వెండి ఖడ్గాన్ని బహుకరించారు. నాగ పడగతో కూడిన ఈ వెండి ఖడ్గం దాదాపు కేజీన్నర పైబడి బరువున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఖడ్గం విలువ రూ. 1,07,100 ఉంటుందని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details