పశ్చిమ గోదావరి జిల్లా కొండూరు మండలం పోతునూరు ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 1994- 95లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులంతా కలుసుకున్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం తమ ఆయుస్సును పెంచుతుందన్నారు. ఉపాధ్యాయులకు.. విద్యార్థులు ప్రయోజకులు అయినప్పుడే ఆనందం కలుగుతుందన్నారు. పూర్వ విద్యార్థులంతా కలిసి.. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు.. ఉపాధ్యాయులను పూలమాలలతో సత్కరించారు.
1994 బ్యాచ్ విద్యార్థుల.. ఆత్మీయ సమ్మేళనం - పోతునూరులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పశ్చిమగోదావరి జిల్లా పోతునూరునులో 1994 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. అప్పటి విద్యార్థులంతా కలిసి అల నాటి జ్ఞాపకాలను తలచుకుంటూ.. సందడి చేశారు. తమ కళ్లల్లో సంతోషాన్ని.. మదిలో ఆనందాన్ని నింపుకున్నారు.
1994 బ్యాచ్.. ఆత్మీయ సమ్మేళనం