ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 7, 2020, 9:48 PM IST

ETV Bharat / state

నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్​ సిబ్బంది దాడి

గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్​ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పక్కిలంకలో నాటుసారా బట్టీలపై అబ్కారీ అధికారులు దాడులు చేశారు.

Police raids on natusara makeing centers
నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు

పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పక్కిలంకలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 30 లీటర్ల నాటుసారాతోపాటు 70 కిలోల నల్లబెల్లం, సారా తయారీకి వినియోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకుని.. నలుగురిని అరెస్టు చేశారు. ఈ దాడుల్లో కొవ్వూరు సీఐ, తాళ్లపూడి ఎస్సైలతోపాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details