వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు విషయంలో.. చట్ట ప్రకారం వ్యవహరిస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అన్నారు. రేపు (సోమవారం) భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో తాను పాల్గొంటానని ఎంపీ రఘురామరాజు ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. రఘురామ భీమవరం రాకపై డీఐజీ పాలరాజు స్పందించారు.
పీఎంవో జాబితాలో రఘురామ పేరు లేదు.. చట్టప్రకారం వ్యవహరిస్తాం : డీఐజీ - mp raghu rama tour shedule
![పీఎంవో జాబితాలో రఘురామ పేరు లేదు.. చట్టప్రకారం వ్యవహరిస్తాం : డీఐజీ raghu rama](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15728068-521-15728068-1656865682148.jpg)
raghu rama
20:55 July 03
రఘురామ భీమవరం వస్తున్నట్లు తమకు సమాచారం లేదని చెప్పారు. అంతేకాదు.. పీఎంవో నుంచి వచ్చిన జాబితాలోనూ ఎంపీ రఘురామ పేరు లేదని స్పష్టం చేశారు. ఎంపీ రఘురామ వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకుంటామన్న డీఐజీ.. చట్టప్రకారమే వ్యవహరిస్తామని చెప్పారు.
ఇవీ చూడండి :
Last Updated : Jul 3, 2022, 10:00 PM IST