ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 10, 2020, 6:21 PM IST

ETV Bharat / state

వరద ప్రవాహంతో పోలవరం స్పిల్​వే పనులకు తాత్కాలిక బ్రేక్​..

పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువున భారీ వర్షాలు కురవడంతో గోదావరిలో వరద క్రమేపి పెరుగుతోంది. నిర్మాణంలో భాగమైన పైలెట్ ఛానల్ ద్వారా స్పిల్​వేలోకి వరద నీరు వచ్చి చేరింది.

Polavaram spillway works stopped by Godavari flood in west godavari district
నిలిచిన పోలవరం స్పిల్​వే పనులు

పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి ప్రవాహం పెరుగుతోంది. వరద నీరు ప్రాజెక్ట్ పనుల్లోకి వచ్చి చేరుతోంది. పైలెట్ ఛానల్ ద్వారా స్పిల్​వేలోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో స్పిల్​వే నిర్మాణంలో పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. గోదావరిలో వరద మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున యంత్రాలన్నీంటిని ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు పోలవరం క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి సమీక్షించారు.

ABOUT THE AUTHOR

...view details