ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలికతో భిక్షాటన చేయిస్తున్న కిడ్నాపర్ అరెస్ట్ - తమిళనాడులో బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తి తణుకులో అరెస్ట్

ఓ బాలికను అపహరించి భిక్షాటన చేయిస్తున్న కిడ్నాపర్​ను పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడులోని మధురై జిల్లా సాతూర్​కు చెందిన మేరీదాస్​ను... మధురై పట్టణ వాసి సెల్వ ఏడాది క్రితం కిడ్నాప్ చేశాడు. నాటి నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాల్లో భిక్షాటన చేయిస్తుండగా.. ఇప్పుడు విషయం పోలీసులు దృష్టికి వెళ్లింది. అమ్మాయికి భిక్షాటన నుంచి విముక్తి లభించింది.

girl kidnaper arrested in tanuku, person kidnaped girl and forced her to beg arrested in tanuku
తమిళనాడు బాలిక కిడ్నాపర్ తణుకులో అరెస్ట్, బాలికతో భిక్షాటన చేయిస్తున్న కిడ్నాపర్ అరెస్ట్

By

Published : Mar 30, 2021, 6:27 PM IST

తమిళనాడులో బాలికను అపహరించి రాష్ట్రానికి తీసుకువచ్చి, భిక్షాటన చేయిస్తున్న అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరులోని బాలికల సంరక్షణ కేంద్రానికి ఆ చిన్నారిని తరలించారు. ఈ బాలికనే కాక ఇంకా ఎవరైనా పిల్లలను కిడ్నాప్ చేసి బిక్షాటన చేయిస్తున్నారా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చైతన్య కృష్ణ వెల్లడించారు. ఆ చిన్నారి సమాచారాన్ని తమిళనాడులోని బాలికా సంరక్షణ కేంద్రానికి తెలియపరచి.. వారిద్వారా తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

ఏడాది క్రితం..

మధురై జిల్లా సాతూర్​కు చెందిన మేరీదాస్ అనే బాలికను.. అదే రాష్ట్రంలోని మధురై పట్టణానికి చెందిన సెల్వ అనే వ్యక్తి ఏడాది క్రితం కిడ్నాప్ చేసి రాష్ట్రానికి తీసుకువచ్చాడు. నాటి నుంచి తిరుపతి, రేణిగుంట, విజయవాడ, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు తదితర ప్రాంతాల్లో భిక్షాటన చేయించాడు. నెల క్రితం తణుకు తీసుకొచ్చి గణేష్ చౌక్ సెంటర్లో భిక్షాటన చేయిస్తున్నాడు. ఈనెల 21న సరిగా యాచించడం లేదని మేరీదాస్​ని తీవ్రంగా దండించాడు. బాలిక అక్కడి నుంచి తప్పించుకుని పాత బెల్లం మార్కెట్ వద్దకు చేరుకుని ఏడుస్తుండగా.. లారీ డ్రైవర్లు గుర్తించి పట్టణ పోలీసులకు అప్పగించారు. దర్యాప్తు చేసిన పోలీసులు.. చివరికి బాలికకు భిక్షాటన నుంచి విముక్తి కలిగించారు.

ఇదీ చదవండి:

పిలిచి అవమానించారని.. సర్పంచ్​ ఆందోళన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details