ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్వారకా తిరుమలలో శుభకార్యాలకు అనుమతి : ఆలయ ఈఓ - ఆలయ ఈఓ భ్రమరాంబ

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు శుభ కార్యాలు నిర్వహించుకోవడానికి దేవస్థానం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు వివరాలను, అనుసరించాల్సిన నియమ నిబంధనలను దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయ ఈఓ భ్రమరాంబ వెల్లడించారు.

ద్వారకా తిరుమలలో శుభకార్యాలకు అనుమతి : ఆలయ ఈఓ
ద్వారకా తిరుమలలో శుభకార్యాలకు అనుమతి : ఆలయ ఈఓ

By

Published : Oct 16, 2020, 7:13 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు శుభ కార్యాలు నిర్వహించుకోవడానికి దేవస్థానం వెసులుబాటు కల్పించిందని ఆలయ ఈఓ భ్రమరాంబ వెల్లడించారు.

పెళ్లిళ్లు..పేరంటాలకు అనుమతి..

భక్తులు వివాహాలు, ఉపనయనాలు అన్నప్రాసన తదితర శుభకార్యాలను జరుపుకోవడానికి అనుమతిస్తున్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి ఆలయంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు నిషేధించినట్లు పేర్కొన్నారు. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.

కొవిడ్ నియమాలను అనుసరిస్తూ..

ఇప్పటి నుంచి దేవాలయంలో నిర్దేశించిన ప్రదేశాల్లోనే , దేవస్థానం కల్యాణ మండపాల్లో ఈ వేడుకలు జరుపుకోవచ్చని వివరించారు. పరిమితికి లోబడి మండపం కెపాసిటీ ప్రకారం 50 శాతానికి మించకుండా ఉండాలన్నారు. కొవిడ్ - 19 అన్​లాక్ 5.0 నిబంధనలను పూర్తిగా పాటిస్తూ నిర్వహించేందుకు అనుమతి ఇస్తామన్నారు. దేవస్థానం కల్యాణ మండపాలు, వసతి గదులు, అతిథి గృహాలు ముందస్తుగా బుకింగ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : ఆడ బిడ్డలకు రక్షణ ఇవ్వని చట్టాలు ఎందుకు..?: పవన్

ABOUT THE AUTHOR

...view details