ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 5, 2021, 12:11 PM IST

ETV Bharat / state

పాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాల పంపిణీ

కరోనా ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో ఉందుర్తి పాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు, వాలంటీర్లు, నాయీ బ్రాహ్మణులకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు..

paal foundation NITYAVASARALA_PAMPINEE
పాల్ పౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యవసర వస్తువులను పంపిణీ

పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో తణుకు పట్టణానికి చెందిన ఉందుర్తి పాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిట్టూరి సుజాత ఆర్థిక సహకారంతో సుమారు వందమందికి పైగా నాయీ బ్రాహ్మణులు, ఆశావర్కర్లు, వాలంటీర్లకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి సుమారు రూ.800విలువగల వస్తువులతోపాటు నూతన వస్త్రాలను బహుకరించారు. కరోనా ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో తమ వంతు సహకారం అందిస్తున్నట్లు చిట్టూరి సుజాత, పాల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రసన్న కుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details