ఆక్సిజన్ బెడ్ సమయానికి దొరక్క ప్రాణాలు విడుస్తున్న కొవిడ్ బాధితులెందరో. ఆ దయనీయ స్థితిని గమనించిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బత్తిన గణేష్ ఫౌండేషన్.. ఓ కళాశాల బస్సును ఆధునికీకరించి దాంట్లో ఎనిమిది మందికి ఆక్సిజన్ అందించేలా ఏర్పాటు చేసింది. ఇప్పటికే కొవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఆ సంస్థ.. ఇప్పుడు సేవలో మరో అడుగు ముందుకేసింది.
ఆక్సిజన్ బస్సు ఏర్పాటు చేసిన బత్తిన గణేష్ ఫౌండేషన్ - bathina ganesh foundation news
సమయానికి ఆక్సిజన్ బెడ్ దొరక్క ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆపదలో ఉన్న అలాంటి వారికి సహాయం చేయాటానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ సంస్థ ముందుకువచ్చింది. ఇప్పటికే అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న సంస్థ.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది.
![ఆక్సిజన్ బస్సు ఏర్పాటు చేసిన బత్తిన గణేష్ ఫౌండేషన్ bathina Ganesh foundation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11907510-1088-11907510-1622032367850.jpg)
బత్తిన గణేష్ ఫౌండేషన్
ఆక్సిజన్ బస్సును ఏర్పాటుచేసిన బత్తిన గణేష్ ఫౌండేషన్
ఇప్పటివరకు 32 మంది అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించామని.. వందలాది కరోనా మృతదేహాలను గమ్యస్థానాలకు చేరవేశామని బత్తిన గణేష్ తెలిపారు.
ఇదీ చదవండి