ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించిన ఎమ్మెల్యే - carona time special portal
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ను ప్రారంభిస్తున్నట్లు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అన్నారు.
![ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించిన ఎమ్మెల్యే west godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7782724-384-7782724-1593190875163.jpg)
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో... కరోనా సమయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఫేస్ బుక్ పోర్టల్ ను చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ప్రారంభించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. నాలుగు మండలాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి కన్వీనర్లను అందుబాటులో ఉంచామన్నారు. ప్రత్యేక పోర్టల్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఎమ్మెల్యే విడుదల చేశారు. WWW.facebook.com/mlapvctp, 18005998555 నంబర్లను ప్రజలకు తెలిసేలా మీడియాకు విడుదల చేశారు.
ఇది చదవండికులాల మధ్య విద్వేషాలు పెంచేలా వ్యవహరిస్తున్నారు: పవన్కల్యాణ్