ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 16, 2022, 7:03 AM IST

ETV Bharat / state

రహదారి పనుల్లో కదలిక.. ‘ఈనాడు’ కథనానికి స్పందన

Roads: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణ పరిధిలోని శ్రీరామపురం రహదారి పనుల్లో కదలిక వచ్చింది. ‘గజానికో గుంత.. దారంతా చింత’ శీర్షికతో ‘ఈనాడు’ ప్రధాన సంచికలో వెలువడ్డ కథనానికి అధికారులు స్పందించి.. డ్రెయిన్ పనులను ప్రారంభించారు.

officials respond to eenadu article over road works at srirampuram in west godavari
రహదారి పనుల్లో కదలిక.. ‘ఈనాడు’ కథనానికి స్పందన

Roads: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణ పరిధిలోని శ్రీరామపురం రహదారి పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ‘గజానికో గుంత.. దారంతా చింత’ శీర్షికన ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ఈ నెల 14న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ రోడ్డుకు ఇరువైపులా డ్రెయిన్‌ నిర్మాణాన్ని శుక్రవారం ప్రారంభించారు. డ్రెయిన్‌ పనులు పూర్తికాగానే బీటీ రోడ్డు నిర్మాణం చేపడతామని పురపాలక డీఈ నారాయణరావు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details