ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాపై పోరుకు నరసాపురం జైన సంఘం విరాళం రూ.10 లక్షలు - Narasapuram Jain sangham donation to CM Relief Fund

కరోనాపై పోరుకు నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు జైన సంఘం సభ్యులు సీఎం, పీఎం సహాయనిధులకు రూ.10 లక్షల విరాళం అందించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని ఎమ్మెల్యే కోరారు.

కరోనాపై పోరుకు నరసాపురం జైన సంఘం సభ్యులు విరాళం
కరోనాపై పోరుకు నరసాపురం జైన సంఘం సభ్యులు విరాళం

By

Published : Apr 7, 2020, 4:20 PM IST

కరోనాపై పోరుకు నరసాపురం జైన సంఘం సభ్యులు విరాళం

కరోనాపై పోరుకు నరసాపురం జైన సంఘం సభ్యులు సీఎం, పీఎం సహాయ నిధులకు రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. అందుకు సంబంధించిన చెక్కును స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు అందించారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని... కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా నరసాపురం జైన సంఘం సభ్యులు ముందుకొచ్చారు. సీఎం, పీఎం సహాయ నిధులకు చెరో రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. అనంతరం నరసాపురం నియోజకవర్గంలో కరోనా నివారణకు విధులు నిర్వహిస్తున్న పలు శాఖల సిబ్బంది 1200 మందికి ఆహార పొట్లాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details