ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటమి ఓ అవకాశం... వచ్చే ఎన్నికలే లక్ష్యం: నాగబాబు - ఓటమి ఓ అవకాశం... వచ్చే ఎన్నికలే లక్ష్యం : జనసేన నేత నాగబాబు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జనసేన పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ అధ్యక్షుడు కొణిదల నాగబాబు పర్యటించారు. నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలే పార్టీకి ఆక్సిజన్ లాంటివాళ్లని ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

జనసేన నేత నాగబాబు

By

Published : Sep 13, 2019, 10:44 PM IST

ఓటమి ఓ అవకాశం... వచ్చే ఎన్నికలే లక్ష్యం : జనసేన నేత నాగబాబు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జనసేన పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ అధ్యక్షుడు కొణిదల నాగబాబు పాల్గొన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు ఆక్సిజన్ లాంటి వాళ్లని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు ఘనంగా పనిచేశారని ప్రశంసించారు. ఓటమి ఒక విధంగా మంచిదేనన్న ఆయన.. వచ్చే ఐదేళ్లలో పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. ప్రతి కార్యకర్త 2024 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతీకార పాలన చేయాలని వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గడిచిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల ఓట్లు వచ్చాయన్న ఆయన 2024 నాటికి 2 కోట్ల ఓట్లు వచ్చేలా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details