ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 17, 2019, 7:12 PM IST

ETV Bharat / state

'పుట్టినరోజున ప్రతి విద్యార్థి మెుక్కను నాటాలి'

'నా ఊపిరి ప్రకృతితో మెుదటి బంధం' కార్యక్రమాన్ని భీమడోలులో నిర్వహించారు. ప్రతి విద్యార్థి తన పుట్టినరోజున ఒక మొక్కను నాటే విధంగా గ్రామదీప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రతి విద్యార్థి పుట్టినరోజున మెుక్కలను నాటాలని సూచించిన కలెక్టర్

ప్రతి విద్యార్థి పుట్టినరోజున మెుక్కలను నాటాలని సూచించిన కలెక్టర్

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని భీమడోలు మండలంలో 'నా ఊపిరి ప్రకృతితో మెుదటి బంధం' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థ గ్రామదీప్ ఆధ్వర్యంలో గుండుగోలనులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు పాఠశాల ఆవరణలో పుట్టినరోజు జరుపుకుంటున్న విద్యార్థులతో మొక్కలు నాటించారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details