ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇళ్ల పట్టాల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుంది' - చోదిమెళ్లలో ఇళ్ల పట్టాల పంపిణీ

ప్రజా సంక్షేమానికి పునాదులు వేస్తూ.. రాష్ట్రంలో 31లక్షల 75వేల 555 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని మంత్రి ధర్మాన కృష్ణ దాస్ వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చోదిమెళ్లలో.. మరో మంత్రి ఆళ్ల నానితో కలిసి 7 వేల మంది లబ్ధిదారులకు స్థలాలు పంపిణీ చేశారు.

minister dharmana
మంత్రి ధర్మాన కృష్ణ దాస్

By

Published : Dec 27, 2020, 8:39 PM IST

రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ఆళ్ల నాని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చోదిమెళ్లలో 7వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను అందజేశారు.

ఇచ్చిన హామీలు అన్నింటినీ సీఎం జగన్ అమలు చేస్తున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. ప్రజా సంక్షేమానికి పునాదులు వేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 31లక్షల 75వేల 555 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పట్టాలు ఇవ్వడమే కాక లబ్ధిదారులకు ఇళ్లూ నిర్మించి ఇస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details