ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Jagananna Colonies:'ఉగాది నాటికి 15.6 లక్షల ఇళ్ల నిర్మాణాలు' - Jagananna Colonies news

రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. తొలివిడతలో 15.6 లక్షల ఇళ్లను రానున్న ఉగాది నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

Minister sri ranganatharaju Review on Housing
ఉగాది నాటికి 15.6 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం

By

Published : Jun 12, 2021, 7:57 PM IST

పేదల ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా తొలి విడతలో 15.6 లక్షల ఇళ్లను రానున్న ఉగాది నాటికి పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్​లో జగనన్న కాలనీల గృహ నిర్మాణాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. రాష్ట్రంలోని 17 వేల కాలనీల్లో ఆషాడమాసంలోపు నిర్మాణాలకు శంకుస్థాపన జరిగేలా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో 30 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు.

క్షేత్రస్థాయిలో భూసేకరణ, పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాల్లో వేగం పెంచేందుకు ప్రతి జిల్లాకు ఒక గృహ నిర్మాణ జాయింట్ కలెక్టర్​ను నియమించామన్నారు. ప్రతి పంచాయతీకి ఒక మండల స్థాయి అధికారితో పాటు 20 మంది లబ్ధిదారులకు ఒక గ్రామ స్థాయి అధికారి నియమించినట్లు ఆయన వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details