ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతుల ఆదాయం రెట్టింపయ్యేలా సాంకేతికత అభివృద్ధి చెందాలి'

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం 25 ఏళ్ల రజతోత్సవంలో.. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. అధికారులు రైతుల వద్దకు వెళ్లి వారి ఆదాయాన్ని రెట్టింపు చేసేలా.. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రూపొందించాలని ఆయన అన్నారు.

By

Published : Mar 28, 2021, 1:29 PM IST

minister kannababu
మంత్రి కన్నబాబు

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం 25 ఏళ్ల రజతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. శాస్త్రవేత్తలు, అధికారులు రైతుల వద్దకు వెళ్లి వారి ఆదాయాన్ని రెట్టింపు చేసేలా.. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రూపొందించాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రైతు పక్షపాతిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు.

రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి.. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సహా పలువురు ప్రముఖులు, రైతులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details